News November 5, 2024
ఐ.పోలవరం: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. టీచర్ అరెస్ట్

ఐ.పోలవరం హైస్కూల్లో విద్యార్థినుల పట్ల మ్యాథ్స్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ హాస్టల్ వార్డెన్ చేసిన ఫిర్యాదుపై మంగళవారం SI మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై వార్డెన్ విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే ఆరోపణలపై టీచర్ రెండుసార్లు సస్పెండ్ అయ్యారు.
Similar News
News October 18, 2025
నిడదవోలు: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేశ్

నిడదవోలు మండలం డి. ముప్పవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేశ్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు, కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ, ఆర్డీఓ సుస్మితా రాణి పాల్గొన్నారు.
News October 16, 2025
క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు: కలెక్టర్

రాజమహేంద్రవరం జీజీహెచ్లోని ఆంకాలజీ విభాగంలో క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. గురువారం ఆసుపత్రిలో ఆమె వైద్య సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు, మౌలిక వసతులు, వైద్య పరికరాల స్థితి, సిబ్బంది భర్తీ, నిర్మాణ పనుల పురోగతి, పరిశుభ్రత వంటి అంశాలపై అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు.
News October 16, 2025
18న రాజమండ్రిలో జాబ్ మేళా

తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 18న రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్రప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన రాజమండ్రిలో మాట్లాడారు. మేళాలో పలు ప్రైవేటు సంస్థల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ఆయన పేర్కొన్నారు.