News April 28, 2024
ఒంగోలులో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒంగోలులోని గొడుగుపాలెంలో శనివారం వేకువజామున జరిగింది. ఒకటో పట్టణ సీఐ ఎం.లక్ష్మణ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న షేక్ ముస్తాక్ కుమార్తె ఆరిఫా సుల్తానా(19) నగరంలోని రైజ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అవడంతో ఇంట్లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News December 14, 2025
ప్రకాశంలో నవోదయకు పరీక్షకు 1998 మంది గైర్హాజరు

ప్రకాశం జిల్లాలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 1998 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఒంగోలు నవోదయ ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. ఒంగోలులోని నవోదయ విద్యాలయ వద్ద ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఆరో తరగతి ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించామన్నారు. మొత్తం 5,502 మంది విద్యార్థులకు గాను, 3,504మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.
News December 14, 2025
ప్రకాశంలో నవోదయకు పరీక్షకు 1998 మంది గైర్హాజరు

ప్రకాశం జిల్లాలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 1998 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఒంగోలు నవోదయ ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. ఒంగోలులోని నవోదయ విద్యాలయ వద్ద ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఆరో తరగతి ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించామన్నారు. మొత్తం 5,502 మంది విద్యార్థులకు గాను, 3,504మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.
News December 13, 2025
ఈ ఒంగోలు అమ్మాయి చాలా గ్రేట్..!

ఒంగోలుకు చెందిన PVR గర్ల్స్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని ఆముక్త తన ప్రతిభతో సత్తాచాటింది. జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తన తొలి ఓపెన్ మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ సాధించింది. 13 ఏళ్ల వయసులోనే మహిళ పైడే మాస్టర్ టైటిల్ పొందిన ఆముక్తను కలెక్టర్ రాజాబాబు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.


