News August 27, 2024
ఒంగోలులో రూ.300 కోట్ల భూకుంభకోణం?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి కనుసన్నల్లో రూ.300 కోట్ల భూకుంభకోణం జరిగిందని విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన వారధి కార్యక్రమంలో పలువురు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఒంగోలు నియోజకవర్గ పరిధిలో నకిలీ స్టాంపు పేపర్లతో దొంగ రిజిస్ట్రేషన్లతో సుమారు రూ.300 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలని కోరారు.
Similar News
News December 19, 2025
ప్రకాశం జిల్లాలో వీరి కల నెరవేరేదెన్నడో?

సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఎవరికి ఉండదు. అందుకే కేంద్రం పీఎం గ్రామీణ ఆవాస్ యోజన ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించింది. నవంబర్ 6 నుంచి జిల్లాలో ఈ సర్వే కొనసాగింది. మొత్తం 38 మండలాల్లో 729 పంచాయతీల్లో 41,706 మంది సొంతింటి కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తించారు. వీరి దరఖాస్తుల రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేయగా, ప్రస్తుతం వీరి సొంతింటి కల నెరవేరడమే తరువాయి భాగం.
News December 19, 2025
ఒంగోలు: రైతులారా ఈ నంబర్స్ సేవ్ చేసుకోండి..!

ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సాగుతున్న నేపథ్యంలో రైతుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ గోపాలకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కంట్రోల్ రూము నంబర్ 8008901457ను సంప్రదించాలన్నారు. వాట్సాప్ నంబర్ 7337359375కు మెసేజ్ చేయాలని జేసీ సూచించారు.
News December 19, 2025
అనాథలను సొంత పిల్లలుగా భావించాలి: ప్రకాశం JC

తల్లిదండ్రులు లేని పిల్లలను సొంత పిల్లలుగా భావిస్తూ వారిని తీర్చిదిద్దాలని ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు JC గోపాలకృష్ణ సూచించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలతో ఆయన సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. అనాథలైన పిల్లలకు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు సమకూర్చాలన్నారు. 18ఏళ్లు దాటిన పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అందించాలని సూచించారు.


