News February 17, 2025

ఒంగోలులో విద్యుత్ అదాలత్ కార్యక్రమం

image

ఒంగోలులో ఈ నెల 18 తేదిన డివిజన్ స్థాయి విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఒంగోలు ఈఈ ఏం.హరిబాబు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వినియోగదారుల ఫోరమ్ ఛైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ పాల్గొంటారని అన్నారు. ఉదయం 10:30 గం నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కార్యక్రమం ఉంటుందని అన్నారు. దీర్ఘ కాలంగా పరిష్కారం కాని విద్యుత్ సమస్యలకు పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.

Similar News

News March 12, 2025

ప్రకాశం జిల్లాకు 57 నూతన ప్రభుత్వ పాఠశాలలు

image

ప్రకాశం జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతనంగా 57 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను నెలకొల్పుతున్నట్లుగా, విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా జిల్లా కలెక్టర్ వాటిని ఆమోదించారు. మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు నివేదికను తీసుకొని ఎక్కడెక్కడ పాఠశాలలను నెలకొల్పాలో, ఓ అంచనాతో విద్యాశాఖ నివేదిక రూపంలో వాటిని అధికారులకు సమర్పించనున్నారు.

News March 12, 2025

ఒంగోలు: ‘భూముల పున పరిశీలన పటిష్టంగా చేపట్టాలి’

image

నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన పటిష్టంగా చేపట్టాలని సీసీఎల్‌ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అమరావతి నుంచి ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ.. నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తిస్థాయిలో పరిశీలన జరగాలన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.

News March 10, 2025

ప్రకాశం: కొరియర్ల పేరుతో భారీ స్కాములు

image

ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్తరకం స్కాములకు పాల్పడుతున్నారు. తాజాగా గిద్దలూరులో కొందరికి సైబర్ నేరగాళ్లు స్పీడ్ పోస్ట్‌లో లక్కీ డ్రా గెలుచారని పోస్టు పంపించారు. కొరియర్ తెరిచి చూడగా లక్కీ డ్రాలో రూ.14,49,000 గెలుచుకున్నారని, ఈ డబ్బు అకౌంట్లో బదిలీ చేయాలంటే రూ.15వేల అమౌంట్ బదిలీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిపై స్పందించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.

error: Content is protected !!