News March 27, 2025
ఒంగోలు: కంప్యూటర్ టెస్ట్ వాయిదా

ఒంగోలు ఏబీఎన్ హైస్కూల్, ముప్పవరంలోని పీఎస్ ఎన్సీసీ హైస్కూల్, చీరాల రామకృష్ణాపురంలోని ఎమ్మెస్ హైస్కూల్లో ఎయిడెడ్ పోస్టుల నియామకానికి ఈనెల 28, 29వ తేదీల్లో కంప్యూటర్ టెస్ట్ జరగాల్సి ఉంది. కొన్ని కారణాలతో టెస్ట్ వాయిదా వేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని కంప్యూటర్ టెస్ట్కు సంబంధించిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.
Similar News
News March 30, 2025
కంభం : కరెంటు వైర్లు తగిలి వ్యక్తి మృతి

కంభం మండలంలోని లింగాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. కుందేళ్ల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి వెలిగొండయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కుందేళ్ల వేట కోసం స్వయంగా తానే పెట్టిన కరెంటు వైర్లను ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. శనివారం రాత్రి ఈ ఘటన జరగగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.
News March 30, 2025
ప్రకాశం: వైసీపీ ఉద్యోగ పెన్షనర్ విభాగ అధ్యక్షులు వీరే..!

ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల ఉద్యోగ పెన్షనర్ల విభాగ అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల వివరాలను కిందిలా ఉన్నాయి.
>గిద్దలూరు- బంగారు విశ్వరూపం
>కనిగిరి – ఏకుల వెంకట సుబ్బారెడ్డి
>దర్శి – రావులపల్లి గురుప్రసాద్
>కొండేపి- పి కృష్ణమూర్తి
>మార్కాపురం – టీ రంగారెడ్డి
>ఒంగోలు – పెట్లూరి ప్రసాద్లు నియమితులయ్యారు.
News March 30, 2025
ప్రకాశం: వైసీపీ ఉద్యోగ పెన్షనర్ విభాగ అధ్యక్షులు వీరే..!

ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల ఉద్యోగ పెన్షనర్ల విభాగ అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల వివరాలను కిందిలా ఉన్నాయి.
>గిద్దలూరు- బంగారు విశ్వరూపం
>కనిగిరి – ఏకుల వెంకట సుబ్బారెడ్డి
>దర్శి – రావులపల్లి గురుప్రసాద్
>కొండేపి- పి కృష్ణమూర్తి
>మార్కాపురం – టీ రంగారెడ్డి
>ఒంగోలు – పెట్లూరి ప్రసాద్లు నియమితులయ్యారు.