News June 4, 2024

ఒంగోలు: కొత్త బైకుపై సంతోషంగా వెళ్తున్న వ్యక్తి మృతి

image

ఒంగోలుకు చెందిన వ్యక్తి కొత్తపల్లి జంక్షన్ పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైకుతో ఢీకొట్టాడు. దీంతో నిలం శివ (35)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడు హైదరాబాదులో బేల్దారి మేస్త్రిగా పనిచేస్తూ.. నేడు తన స్వగ్రామమైన ఒంగోలుకు వస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. కొత్త బైకు తీసుకుని సొంతూరికి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

Similar News

News February 28, 2026

AP కొత్త CSగా.. ప్రకాశం జిల్లా వాసి.!

image

AP చీఫ్ సెక్రెటరీగా <<19261711>>సాయిప్రసాద్<<>> నేడు బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన ఆయన 1991 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. తన సర్వీసులో కీలక పోస్టులలో పని చేశారు. 2024 జూన్ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శిగా.. 2025 జనవరి నుంచి CM ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 2019-24 మధ్య ఏపీ సోలార్ కార్పొరేషన్ CMDగా కూడా పనిచేశారు.

News February 28, 2026

AP కొత్త CSగా.. ప్రకాశం జిల్లా వాసి.!

image

AP చీఫ్ సెక్రెటరీగా <<19261711>>సాయిప్రసాద్<<>> నేడు బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన ఆయన 1991 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. తన సర్వీసులో కీలక పోస్టులలో పని చేశారు. 2024 జూన్ నుంచి జలవనరుల శాఖ కార్యదర్శిగా.. 2025 జనవరి నుంచి CM ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 2019-24 మధ్య ఏపీ సోలార్ కార్పొరేషన్ CMDగా కూడా పనిచేశారు.

News February 27, 2026

మార్కాపురం జిల్లాలో అధికారి సస్పెండ్

image

మార్కాపురం జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. పుల్లలచెరువు మండలం చాపలమడుగు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు ఇచ్చారు. గ్రామ పంచాయతీ నిధులు అక్రమంగా దుర్వినియోగం చేశారనే అభియోగంతో డిప్యూటీ MPDO విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని MPDOని కలెక్టర్ ఆదేశించారు.