News February 16, 2025
ఒంగోలు: ‘దివ్యాంగుల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి’

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారు 60 మంది దివ్యాంగులు వారి సమస్యలపై అర్జీలను సమర్పించినట్లు చెప్పారు. సత్వరమే ఈ అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.
Similar News
News March 12, 2025
ప్రకాశం జిల్లాకు 57 నూతన ప్రభుత్వ పాఠశాలలు

ప్రకాశం జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతనంగా 57 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను నెలకొల్పుతున్నట్లుగా, విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా జిల్లా కలెక్టర్ వాటిని ఆమోదించారు. మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు నివేదికను తీసుకొని ఎక్కడెక్కడ పాఠశాలలను నెలకొల్పాలో, ఓ అంచనాతో విద్యాశాఖ నివేదిక రూపంలో వాటిని అధికారులకు సమర్పించనున్నారు.
News March 12, 2025
ఒంగోలు: ‘భూముల పున పరిశీలన పటిష్టంగా చేపట్టాలి’

నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన పటిష్టంగా చేపట్టాలని సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అమరావతి నుంచి ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ.. నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తిస్థాయిలో పరిశీలన జరగాలన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.
News March 10, 2025
ప్రకాశం: కొరియర్ల పేరుతో భారీ స్కాములు

ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్తరకం స్కాములకు పాల్పడుతున్నారు. తాజాగా గిద్దలూరులో కొందరికి సైబర్ నేరగాళ్లు స్పీడ్ పోస్ట్లో లక్కీ డ్రా గెలుచారని పోస్టు పంపించారు. కొరియర్ తెరిచి చూడగా లక్కీ డ్రాలో రూ.14,49,000 గెలుచుకున్నారని, ఈ డబ్బు అకౌంట్లో బదిలీ చేయాలంటే రూ.15వేల అమౌంట్ బదిలీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిపై స్పందించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.