News March 21, 2025

ఒంగోలు: పసికందు హత్య.. తండ్రికి యావజ్జీవ శిక్ష.!

image

భార్య పైన అనుమానంతో మూడేళ్ల పసికందును హత్య చేసిన కసాయి తండ్రి ఖాదర్‌కి ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి భారతి గురువారం యావజ్జీవ శిక్ష విధించారు. చీమకుర్తిలో భార్య సాల్మాతో కలిసి భర్త ఖాదర్ నివాసం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. ఏడేళ్ల క్రితం భార్యపై అనుమానంతో కుమారుడు సాహుల్ గొంతు కోసి హత్య చేశాడు. నింద రుజువైనందున ఎట్టకేలకు ఏడేళ్లకు అతనికి యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది.

Similar News

News March 28, 2025

సల్మాన్ ఖాన్‌పై సౌత్ ఆడియన్స్ విమర్శలు

image

సల్మాన్ ఖాన్ సౌత్ ఆడియన్స్‌పై తాజాగా చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ సినిమాల్ని <<15910211>>దక్షిణ రాష్ట్రాల వాళ్లు చూడట్లేదని<<>> సల్మాన్ వాపోయిన సంగతి తెలిసిందే. మేం చూడకుండానే ప్రేమపావురాలు, ప్రేమాలయం, క్రిష్, 3 ఇడియట్స్, ధూమ్, ధూమ్ 2, బజరంగీ భాయ్‌జాన్ వంటి అనేక సినిమాలు హిట్ అయ్యాయా అంటూ పలువురు సినీ ప్రేమికులు నెట్టింట సల్మాన్‌ను ప్రశ్నిస్తున్నారు.

News March 28, 2025

అనకాపల్లి: ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్

image

అనకాపల్లి జిల్లాలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అనకాపల్లి జిల్లాలో నాలుగు ఎంపీపీ, రెండు వైస్ ఎంపీపీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో మాకవరపాలెం, ఎస్.రాయవరం, దేవరాపల్లి, వి.మాడుగుల ఎంపీపీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. ఇక వైస్ ఎంపీపీలుగా చోడవరంలో వైసీపీ గెలుపొందగా.. సబ్బవరంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.

News March 28, 2025

GNT: మైనర్ బాలికతో ప్రేమ పెళ్లి.. పోక్సో కేసు నమోదు

image

బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ యువకుడి‌పై పట్టాభిపురం పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. ఆ మైనర్ బాలిక మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో ఆ కుటుంబాల్లో గొడవలు జరిగాయి. దీంతో వారు స్టేషన్ మెట్లు ఎక్కడంతో పెళ్లి జరిగి 8 నెలలైందని పోలీసులు గుర్తించారు.

error: Content is protected !!