News March 25, 2025

ఒంగోలు: ‘ఫిర్యాదులు సత్వరమే పరిష్కరిస్తాం’

image

ప్రజల నుంచి వచ్చే పిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమన్ని జిల్లా ఎస్పీ దామోదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. 81 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News September 12, 2025

ఉలవపాడు: బాలికపై సచివాలయం ఉద్యోగి అత్యాచారం

image

ఉలవపాడులో ఇటీవల ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. SI అంకమ్మ వివరాల ప్రకారం.. ఇటీవల అనాధగా కనిపించిన బాలిక(13)ను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా చేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పనిమనిషిగా చేసింది. ఈక్రమంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 12, 2025

ప్రకాశం: ప్లెక్సీ యజమానులకు, ప్రజలకు ఎస్పీ కీలక సూచన!

image

ఫ్లెక్సీల రూపంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అనుచిత పదజాలంపై కఠిన చర్యలు తీసుకుంటామని SP దామోదర్ అన్నారు. గురువారం SP కార్యాలయంలో మాట్లాడుతూ.. డిజైన్ చేసే వారికి, ప్రజలకు, ప్రింటింగ్ ప్రెస్ వారికి సూచనలు చేశారు. ఫ్లెక్సీ పోస్టర్స్, ప్లకార్డుల రూపంలో వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వర్గాల మధ్య విద్వేషాలను రేకెత్తిస్తున్నాయని, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు.

News September 11, 2025

ప్రకాశం నూతన కలెక్టర్.. నేపథ్యం ఇదే!

image

ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 2013 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అఫీసర్ గతంలో ఆయన ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. ఏపీ స్టెప్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో, హౌసింగ్ కార్పొరేషన్ MD, కృష్ణా కలెక్టర్, విశాఖ గ్రేటర్ కమిషనర్‌గా వివిధ పదవులు నిర్వర్తించారు.