News March 25, 2025

ఒంగోలు: ‘ఫిర్యాదులు సత్వరమే పరిష్కరిస్తాం’

image

ప్రజల నుంచి వచ్చే పిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమన్ని జిల్లా ఎస్పీ దామోదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. 81 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 27, 2025

ప్రకాశం: ఈ 9 మండలాల ప్రజలు జాగ్రత్త..!

image

ప్రకాశం జిల్లాలోని 9 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావటంతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. చీమకుర్తిలో 40.6, దర్శిలో 41.5, దొనకొండలో 40.7, కురిచేడులో 41.3, ముండ్లమూరులో 41.5, పొదిలిలో 41, పుల్లలచెరువులో 40.9, తాళ్లూరులో 41.2, త్రిపురాంతకంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు.

News March 27, 2025

ఒంగోలు: కంప్యూటర్ టెస్ట్ వాయిదా

image

ఒంగోలు ఏబీఎన్ హైస్కూల్, ముప్పవరంలోని పీఎస్ ఎన్‌సీసీ హైస్కూల్, చీరాల రామకృష్ణాపురంలోని ఎమ్మెస్ హైస్కూల్లో ఎయిడెడ్ పోస్టుల నియామకానికి ఈనెల 28, 29వ తేదీల్లో కంప్యూటర్ టెస్ట్ జరగాల్సి ఉంది. కొన్ని కారణాలతో టెస్ట్ వాయిదా వేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని కంప్యూటర్ టెస్ట్‌కు సంబంధించిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.

News March 27, 2025

ప్రకాశం జిల్లాలో టెన్షన్.. టెన్షన్

image

ప్రకాశం జిల్లాలో మరికాసేపట్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ పదవులకు ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి కూటమి నాయకులు ప్లాన్ చేశారని సమాచారం. త్రిపురాంతకం వైసీపీ ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డి జైల్లో ఉన్నారు. మరి అక్కడ ఆయన గెలుస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. నిన్న రాత్రి నుంచే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

error: Content is protected !!