News February 19, 2025
ఒంగోలు: రెవెన్యూ సదస్సుల అర్జీలపై నిర్లక్ష్యం వద్దు

రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని తహశీల్దార్లకు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సూచించారు. మంగళవారం ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో ఒంగోలు, కొత్తపట్నం, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండల తహశీల్దార్లతో జేసీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవిన్యూ సదస్సులు నిర్వహించినందున, వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని JC ఆదేశించారు.
Similar News
News February 20, 2025
ప్రకాశం జిల్లా టాప్ న్యూస్

* మర్రిపూడిలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ * వరల్డ్ ఛాంపియన్గా ప్రకాశం జిల్లా వ్యక్తి* ప్రకాశం జిల్లాలో బర్డ్ ప్లూ లేదు* రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్* వన్య ప్రాణుల ప్రాణాలకు విలువ లేదా?: ఎమ్మెల్యే తాటిపర్తి* 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి: డీఆర్వో * వారబందీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్
News February 20, 2025
దోర్నాల: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దోర్నాల గుండా శ్రీశైలం వెళ్లే భక్తులను అటవీశాఖ అధికారులు 24 గంటలు అనుమతించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రకాశం జిల్లా డీఎఫ్వో మాట్లాడుతూ.. 24 గంటల అనుమతి అని అసత్య ప్రచారం సాగుతుందని, భక్తులకు ఈ మార్గంలో రాత్రి 9 గంటల వరకే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
News February 20, 2025
వారబందీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

వారబంది విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్ద నుంచి వస్తున్న నాగార్జునసాగర్ నీటిని నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. వస్తున్న నీటిని పరిగణలోకి తీసుకొని జిల్లాలో నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు మళ్లించాలని తెలిపారు.