News March 28, 2025
ఒంగోలు: వివాదాలకు కేంద్ర బిందువుగా బాలినేని

అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.
Similar News
News September 12, 2025
ప్రకాశం: ప్లెక్సీ యజమానులకు, ప్రజలకు ఎస్పీ కీలక సూచన!

ఫ్లెక్సీల రూపంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అనుచిత పదజాలంపై కఠిన చర్యలు తీసుకుంటామని SP దామోదర్ అన్నారు. గురువారం SP కార్యాలయంలో మాట్లాడుతూ.. డిజైన్ చేసే వారికి, ప్రజలకు, ప్రింటింగ్ ప్రెస్ వారికి సూచనలు చేశారు. ఫ్లెక్సీ పోస్టర్స్, ప్లకార్డుల రూపంలో వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వర్గాల మధ్య విద్వేషాలను రేకెత్తిస్తున్నాయని, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు.
News September 11, 2025
ప్రకాశం నూతన కలెక్టర్.. నేపథ్యం ఇదే!

ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 2013 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అఫీసర్ గతంలో ఆయన ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. ఏపీ స్టెప్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో, హౌసింగ్ కార్పొరేషన్ MD, కృష్ణా కలెక్టర్, విశాఖ గ్రేటర్ కమిషనర్గా వివిధ పదవులు నిర్వర్తించారు.
News September 11, 2025
ప్రకాశం కలెక్టర్ మీకోసంకు అధిక ప్రాధాన్యత!

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బదిలీ అయ్యారు. 2024 జూన్ 27న ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఈమె బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఒక ఏడాది 3 నెలల పాలన సాగించారు. ఒంగోలు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో అర్జీదారులకు మాలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. అర్జీదారులకు భోజన వసతి, ఫ్రీగా అర్జీల రాయింపు వంటి చర్యలు చేపట్టారు.