News May 5, 2024

ఒంగోలు: సంతకం చేశారు.. స్టాంప్ మరిచారు

image

ఒంగోలులో ఆర్‌ఎం స్కూల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లలో లోపాలు తలెత్తడంతో కొద్దిసేపు సందిగ్ధత నెలకొంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు వేసే ముందు వారు సమర్పించే పత్రాల్లో గెజిటెడ్ సంతకంతో పాటు స్టాంప్‌కూడా ఉండాలి. కానీ ఆర్‌ఎం స్కూల్‌లో 16 మంది ఉద్యోగుల పత్రాలపై గెజిటెడ్ సంతకం ఉంది. కానీ స్టాంప్ లేకపోవడాన్ని గుర్తించారు. ఉద్యోగులు కొద్దిసేపు నిరసన తెలిపాక స్టాంప్ వేసి ఓటు వేయించారు.

Similar News

News September 11, 2025

ఒంగోలు: అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

image

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి 3 ఏళ్ల జైలుశిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. కొమరోలు మండలం మైనర్ బాలిక పట్ల వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో పోలీసులు సరైన సాక్ష్యాలు సేకరించారు. తాజాగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించగా పోలీసులను SP దామోదర్ అభినందించారు.

News September 10, 2025

రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

image

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రభావం ప్రకాశం జిల్లాపై సైతం పడుతుందని పేర్కొంది. దీంతో ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో నేటి సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి.

News September 10, 2025

ఆందోళన చెందవద్దని.. ప్రకాశం కలెక్టర్ పిలుపు!

image

రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని, ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం ముండ్లమూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో యూరియా సరఫరా, పంపిణీపై రైతులకు అవగాహన కలిగించే ఉద్దేశంతో చేపట్టిన మెగా అవుట్ రీచ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.