News April 7, 2025
ఒంటిమామిడిపల్లి పాఠశాలను సందర్శించిన ఆకునూరి

ఒంటిమామిడిపల్లి పాఠశాలను విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి సందర్శించారు. విద్యార్థులను ఛైర్మన్ పలు అంశాల్లో ప్రశ్నించి వారి ప్రతిభా పాటవాలను మెచ్చుకున్నారు. తరగతి గదులు, ప్రీ ప్రైమరీ ప్లే టూల్స్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, మినరల్ వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
Similar News
News April 9, 2025
వచ్చే నెలలో అయోధ్య రాముడికి పట్టాభిషేకం

అయోధ్యలో వచ్చే నెలలో శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఆలయంలోని మొదటి అంతస్తులో రామ దర్బార్ను ఏర్పాటు చేయనున్నారు. దర్బారుకు సంబంధించిన పాలరాతి విగ్రహాలను జైపూర్లో శిల్పి ప్రశాంత్ పాండే తీర్చిదిద్దుతున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. పట్టాభిషేకానికి పరిమితంగా మాత్రమే అతిథుల్ని ఆహ్వానించనున్నట్లు సమాచారం.
News April 9, 2025
ADB: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
News April 9, 2025
మహిళలకు కర్ణాటక మంత్రి క్షమాపణలు

బెంగళూరులో ఇద్దరు మహిళల పట్ల ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ‘నగరాల్లో మహిళలపై లైంగిక దాడులు సాధారణమే’ అన్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది వాటిని వక్రీకరించారు. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన మహిళలు నన్ను క్షమించండి. స్త్రీల రక్షణకే నేనెప్పుడూ అధిక ప్రాధాన్యాన్ని ఇస్తాను’ అని వివరణ ఇచ్చారు.