News April 7, 2025
ఒంటిమామిడిపల్లి పాఠశాలను సందర్శించిన ఆకునూరి

ఒంటిమామిడిపల్లి పాఠశాలను విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి సందర్శించారు. విద్యార్థులను ఛైర్మన్ పలు అంశాల్లో ప్రశ్నించి వారి ప్రతిభా పాటవాలను మెచ్చుకున్నారు. తరగతి గదులు, ప్రీ ప్రైమరీ ప్లే టూల్స్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, మినరల్ వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
Similar News
News September 18, 2025
‘తెలంగాణ చరిత్ర తెలియాలంటే సూర్యాపేటకు రండి’

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారని బృందాకారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల సెమినార్లో ఆమె మాట్లాడారు. సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చూపిస్తున్నారన్నారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షాలకు తెలంగాణ చరిత్ర తెలియాలంటే సూర్యాపేటకు వచ్చి చూడాలని ఆమె సవాల్ విసిరారు. చరిత్రను వక్రీకరించడం మానుకోవాలని హెచ్చరించారు.
News September 18, 2025
అంధుల పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక

ఖమ్మం జిల్లాలో అంధుల కోసం పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంధుల స్కూల్ ఏర్పాటుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ, జడ్పీ సీఈఓ, విద్యాశాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.
News September 18, 2025
ఆసిఫాబాద్లో మహిళ అదృశ్యం.. కేసు నమోదు

ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్కు చెందిన జంగంపల్లి పద్మ(32) అనే మహిళ అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఈరోజు తెలిపారు. ఈనెల 15న తన పుట్టింటికి వెళతానని భర్త రాజేశ్వర్కు చెప్పి వెళ్లిందని, కానీ ఆమె పుట్టింటికి కూడా వెళ్లలేదన్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.