News April 7, 2025
ఒంటిమిట్టలో మంత్రుల పర్యటన

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో ఆదివారం నుంచి ప్రారంభమైన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, ఆనం, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర పర్యవేక్షించారు. ముందుగా కోదండ రామస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News April 12, 2025
ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం

ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫోన్లు, కంప్యూటర్లు, చిప్లకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు అమెరికాలో ఎక్కువగా ఉత్పత్తి అవ్వవు. వీటిని పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటుంది. ఈ నిర్ణయంతో ఎలక్ట్రానిక్స్ ధరలపై అదనపు సుంకం భారం ఉండదు.
News April 12, 2025
అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయండి: కలెక్టర్

ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సభ గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు ఆవిష్కరించారు.
News April 12, 2025
కృష్ణా జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన మొవ్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల

ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 87% ఉత్తీర్ణతతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. 83.5% ఉత్తీర్ణతతో అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండవ స్థానంలో, 79% ఉత్తీర్ణతతో మచిలీపట్నంలోని లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మూడో స్థానంలో నిలిచింది. ఉత్తమ ఫలితాలు సాధించిన ఆయా కళాశాలల యాజమాన్యాలను ఇంటర్ బోర్డు జిల్లా అధికారి సాల్మన్ రాజు అభినందించారు.