News January 25, 2026

ఒంటి కాలిపై నిల్చోగలరా.. ప్రయోజనాలివే

image

ఒంటి కాలిపై నిల్చోవడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల మరింత బలంగా అవ్వొచ్చని, జ్ఞాపకశక్తి, బ్యాలెన్స్ పెరుగుతుందని అంటున్నారు. ఒక కాలుపై నిలబడి ప్రాక్టీస్ చేసే వారికి కండరాల బలహీనత తగ్గి, పటుత్వం పెరుగుతుందని చెబుతున్నారు. 10 సెకెన్లపాటు అలా నిల్చోలేని మధ్య వయసు వారు ఏడేళ్లలో ఏదో ఒక కారణంతో మరణించే ప్రమాదం 84% ఎక్కువని ఓ స్టడీలో తేలిందని పేర్కొంటున్నారు.

Similar News

News February 22, 2026

పాకిస్థాన్ ఖాతాలో అవాంఛిత రికార్డు

image

T20WC సూపర్-8లో భాగంగా నిన్న న్యూజిలాండ్vsపాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఓ అవాంఛిత రికార్డును మూటగట్టుకుంది. అత్యధిక T20I మ్యాచ్‌లు(7) రద్దయిన జట్ల జాబితాలో అగ్రస్థానానికి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐర్లాండ్(6), న్యూజిలాండ్(6), ఇండియా(4), నెదర్లాండ్స్(4) ఉన్నాయి. నిన్న మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.

News February 22, 2026

కరెంటు సమస్యలా? ఈ నంబర్‌కు HI అని మెసేజ్ చేయండి

image

TGSPDCL వాట్సాప్ చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. 8712441912 నంబర్‌కు HI అని మెసేజ్ చేసి పలు సర్వీసులను పొందవచ్చు. కంప్లైంట్స్‌ రిజిస్టర్, కంప్లైంట్ ట్రాక్, బిల్ వివరాలు, పవర్ సప్లై స్టేటస్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సమస్యపై ఏజెంట్‌తో చాట్ చేయొచ్చు. 24/7 ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
#ShareIt

News February 22, 2026

భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం MOU

image

AP: భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, CM CBN సమక్షంలో MOU జరిగింది. MOUపై భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ అందించే లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నట్లు CM వెల్లడించారు. రాష్ట్రంలోని 13,426 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.