News April 20, 2025
ఒకే కాన్పులో ముగ్గురు జననం

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్ థైరాయిడ్ ఉండటం వలన ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనించారు.
Similar News
News December 15, 2025
కనకాంబరం సాగుకు అనువైన రకాలు

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.
News December 15, 2025
MDK: సర్పంచ్ ఎన్నికల్లో అన్నాచెల్లెళ్ల గెలుపు!

మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో అన్నాచెల్లెళ్లు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. కొండాపూర్ గ్రామ సర్పంచ్గా అన్న బేగరి పండరి గెలుపొందారు. అదే మండలంలోని కొత్వాల్ పల్లిలో చెల్లెలు మాల సంగమ్మ సర్పంచ్గా నేరుగా బరిలో నిలిచి ప్రజాభిమానంతో గెలుపొందారు. వేర్వేరు గ్రామాల నుంచి సొంత అన్నాచెల్లెళ్లు విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
News December 15, 2025
యువ సత్తా.. 22 ఏళ్లకే సర్పంచ్

TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటారు. కామారెడ్డిలో కళ్యాణి గ్రామ సర్పంచ్గా 22 ఏళ్ల నవ్య(Left) ఎన్నికయ్యారు. నవ్యకు 901 ఓట్లు పోలవ్వగా, ప్రత్యర్థి రత్నమాలకు 317 ఓట్లు వచ్చాయి. దీంతో 584 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. భూపాలపల్లిలోని దుబ్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి అంజలి(23-Right) గెలుపొందారు. ప్రత్యర్థిపై 41 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు.


