News January 25, 2025

ఒకే నెలలో కొండగట్టు ఆలయానికి ముగ్గురు ఈవోలు

image

కొండగట్టు అంజన్న ఆలయ ఈఓగా ఇవాళ ఉప కమిషనర్ కృష్ణ ప్రసాద్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇదే నెలలో ముగ్గురు కొండగట్టు ఈఓలుగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఇక్కడి ఈఓ రామకృష్ణ బదిలీపై వెళ్లగా వేములవాడ ఈఓ వినోద్ రెడ్డికి అదనపు బాధ్యతలు కల్పించారు. తర్వాత శ్రీకాంత్ రావు వరంగల్ ను నియమిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయగా, బాధ్యతలు చేపట్టి సెలవుపై వెళ్ళారు. దీంతో కృష్ణ ప్రసాద్‌ను నియమించారు.

Similar News

News November 12, 2025

జూబ్లీహిల్స్: కాంగ్రెస్ VS BRS.. పోలీసులకు తలనొప్పి..!

image

ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం పలు చోట్ల ఉద్రిక్తల నడుమ సాగింది. కాంగ్రెస్, BRS నేతలు నువ్వానేనా అన్నచందంగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. నినాదాలు, నిరసనలు, బైఠాయింపులు, వాగ్వాదాలు, అరెస్ట్‌లతో పాటు చివరకు PSలలో పరస్పరం ఫిర్యాదులు చేసేదాకా ఇరు పార్టీల నాయకులు వెళ్లారు. దీంతో వీరి వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారగా ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేశారు.

News November 12, 2025

జూబ్లీహిల్స్: కాంగ్రెస్ VS BRS.. పోలీసులకు తలనొప్పి..!

image

ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం పలు చోట్ల ఉద్రిక్తల నడుమ సాగింది. కాంగ్రెస్, BRS నేతలు నువ్వానేనా అన్నచందంగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. నినాదాలు, నిరసనలు, బైఠాయింపులు, వాగ్వాదాలు, అరెస్ట్‌లతో పాటు చివరకు PSలలో పరస్పరం ఫిర్యాదులు చేసేదాకా ఇరు పార్టీల నాయకులు వెళ్లారు. దీంతో వీరి వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారగా ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదు చేశారు.

News November 12, 2025

నల్గొండ: జూబ్లీహిల్స్‌‌ ఫలితాలపై కాయ్ రాజా కాయ్..!

image

జూబ్లీహిల్స్‌ బైపోల్ బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. అక్కడి గెలుపోటములపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. కొందరు మొబైల్ యాప్స్‌లో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల ద్వారా పందేలు వేస్తున్నారు. ఎన్నిక ఫలితం వెలువడే నాటికి రూ.లక్షల్లో చేతులు మారే అవకాశముందని టాక్. బిహార్ ఎన్నికల ఫలితాలపైనా పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎన్నికల ఫలితాలు ఎల్లుండి రానున్నాయి.