News October 5, 2025

ఒకే మొక్కకు 50 కాయలు

image

వజ్రకరూరు మండలం పిసి ప్యాపిలిలో రైతు మీనుగ ఓబులేసు తన పొలంలో వేరుశనగ పంటను సాగు చేశాడు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడం వల్ల పంట దిగుబడి అధికంగా వచ్చిందన్నారు. ఒకే మొక్కకు 50 కాయలు కాశాయంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

Similar News

News October 5, 2025

అల్లూరి జిల్లాలో రేపటి నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు

image

అల్లూరి జిల్లాలోని 22 మండలాల్లో, మండల స్థాయి క్రీడా పోటీలను ఈనెల సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. మండల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, షెటిల్, యోగా, చెస్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు లేపు యాప్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పోటీల నిర్వహణకు మండల స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్లను నియమించామన్నారు.

News October 5, 2025

NLG: ఫోన్లు ఎత్తని ఎక్సైజ్ అధికారులు!

image

జిల్లాలో ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వారికి కంప్లైంట్ ఇవ్వాలన్నా, వారి నుంచి సమాచారం తెలుసుకోవాలన్నా.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని ప్రజలు వాపోతున్నారు.

News October 5, 2025

కట్టంగూర్: యార్డు లేక దోపిడీ.. పట్టించుకునే వారేరి?

image

కట్టంగూరు మండల కేంద్రంలో వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు లేక రైతులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో వరి, పత్తి పంటలను పెద్ద ఎత్తున రైతులు సాగు చేస్తున్నారు. మండలంలో 22 గ్రామపంచాయతీలకు సంబంధించిన రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించేందుకు స్థానికంగా మార్కెట్ యార్డు లేకపోవడంతో దళారులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారులు స్పందించి ఇక్కడ సబ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరారు.