News December 31, 2025

ఒక్కరితో ఆపొద్దు.. ఇద్దరు ముగ్గురికి జన్మనివ్వండి: అస్సాం CM

image

హిందూ జంటలు ఒక్క సంతానంతో ఆపొద్దని, ఇద్దరిని కనాలని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ కోరారు. అవకాశం ఉన్నవాళ్లు ముగ్గురికి జన్మనివ్వాలన్నారు. రాష్ట్రంలో హిందువుల బర్త్ రేట్ తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జననాల రేటు ఎక్కువగా ఉందన్నారు. 7-8 మంది పిల్లల్ని కనొద్దని ముస్లింలను కోరారు. AP CM CBN కూడా ఇద్దరు/ముగ్గురు పిల్లల్ని కనాలని కోరుతున్న విషయం తెలిసిందే.

Similar News

News January 11, 2026

ఆదివార వ్రతాన్ని ఎలా ఆచరించాలి?

image

ఆదివార వ్రతాన్ని ఏడాదంతా ఆచరిస్తే శుభ ఫలితాలుంటాయి. అది వీలుకాకపోతే మాసానికొకటి చొప్పున 12 వారాలు చేయవచ్చు. ఆ రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఎర్ర చందనం, దర్భ కలిపిన జలాన్ని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆదిత్య హృదయం, సూర్య మంత్రాలు పఠించాలి. ఉపవాసముంటే ఉత్తమం. పూజ ముగిశాక దంపతులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. ఈ వ్రతం చేస్తే ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

News January 11, 2026

‘భూ భారతి’లో అక్రమాలు.. CM సీరియస్!

image

TG: ‘భూ భారతి’ ఛార్జీల చెల్లింపులో <<18815490>>అక్రమాలపై<<>> CM రేవంత్ సీరియస్ అయినట్లు సమాచారం. ‘ధరణి’ ఉన్నప్పటి నుంచే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించామని మంత్రి పొంగులేటి తెలిపారు. దీనిపై విచారణ జరపాలని, మోసానికి పాల్పడిన ఆన్‌లైన్ కేంద్రాల నిర్వాహకుల నుంచి డబ్బు రికవరీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గత 4ఏళ్లలో థర్డ్ పార్టీ ఆడిట్ జరగకపోవడం, సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఈ <<18804858>>స్కామ్‌కు<<>> కారణంగా భావిస్తున్నారు.

News January 11, 2026

పోలవరం స్పిల్‌వేకు ద్రవిడియన్ తోరణాలు!

image

AP: పోలవరం తొలిదశను 2027 ఉగాది నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు గతంలో అనుకున్న జూన్ లక్ష్యాన్ని మార్చి నాటికి కుదించాలని అధికారులకు ఆదేశించారు. దీనికి నిర్మాణ సంస్థ మేఘా సైతం అంగీకరించింది. ఇదే సమయంలో పోలవరం స్పిల్‌వేను ద్రవిడియన్ శైలిలో ఉన్న తోరణాలతో అలంకరించేందుకు డిజైన్లను సదరు సంస్థ CMకు చూపించింది. వీటిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.