News April 24, 2024
ఒక్కరోజే 30 నామినేషన్లు దాఖలు

నెల్లూరు జిల్లాలో నామినేషన్లు ఊపందుకున్నాయి. నాలుగో రోజు సోమవారం ఒక్కరోజే దాదాపు 30 నామినేషన్లను స్వీకరించినట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్లో ఆదాల, సిటీలో నారాయణ, సర్వేపల్లిలో కాకాణి, ఆత్మకూరులో ఆనం, ఉదయగిరిలో కాకర్ల సురేశ్ నామినేషన్లు దాఖలు చేశారు.
Similar News
News October 12, 2025
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ

నిబంధనలు అతిక్రమించి అక్రమంగా బాణసంచా తయారు చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా. అజిత వేజెండ్ల హెచ్చరించారు. ప్రజల శ్రేయస్సు కోసం బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్స్, మందు గుండు సామాగ్రి విక్రయించే దుకాణాలను, పరిసర ప్రాంతాల భద్రతాపరమైన ప్రామాణికలను పాటిస్తున్నారా లేదా అని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
News October 12, 2025
పీపీపీ విధానంలో 110 మెడికల్ సీట్లు అదనం : సీఎం

కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభించిన తర్వాత మాట్లాడారు. దీని వల్ల పేద విద్యార్థులకు అదనంగా 110 మెడికల్ సీట్లు వస్తాయని తెలిపారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానంలో ఆసుపత్రులు కడితే మరో 20 ఏళ్లు సమయం పడుతుందని, అప్పటివరకు పేదలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు.
News October 11, 2025
గంజాయి, మద్యంతో విచక్షణ కోల్పోతున్న యువత

జంట హత్యలతో నెల్లూరు నగరం ఉలిక్కిపడింది. మత్తులో విచక్షణ కోల్పోయిన నిందితులు కత్తులతో దాడులు, దోపిడీలు చేస్తున్నారు. రాము మద్యం డబ్బుల కోసం స్నేహితుడిపై కత్తితో దాడి చేయగా, మరో ఘటనలో డబ్బులివ్వలేదని చెప్పినవారిపై దాడి జరిగింది. నగరంలో గంజాయి, మద్యం విక్రయాలు విస్తరిస్తుండటంతో నేరాలు పెరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పాతనేరస్తులు రోడ్లపై కాపు కాస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.