News December 28, 2025
ఒక్క రోజే సెలవులో 40వేల మంది టీచర్లు

TG: నిన్న ఒకే రోజు 40వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లు సెలవు పెట్టారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే హాలిడేస్, ఇవాళ(28న) ఆదివారం కావడంతో శనివారం(27న) లీవ్ పెట్టారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇయర్ ఎండింగ్ కావడంతో CLలు సద్వినియోగం చేసుకునే ఆలోచనలో కొందరు సెలవు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.12 లక్షల మంది టీచర్లు ఉండగా నిన్న ఒక్కరోజు 33% సెలవులో ఉన్నారు. దీంతో పలు చోట్ల పాఠాలు అటకెక్కాయి.
Similar News
News January 2, 2026
2025లో శ్రీవారి ఆదాయం రూ.1,383 కోట్లు

AP: 2025లో తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.1,383.90 కోట్లు లభించగా, ఇది 2024తో పోలిస్తే రూ.18 కోట్లు అధికం. 2.61 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయాల్లోనూ రికార్డు నమోదైంది. మొత్తం 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడవగా, గత ఏడాదితో పోలిస్తే 1.37 కోట్లు ఎక్కువ. డిసెంబరు 27న గత పదేళ్లలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూల విక్రయం జరిగింది.
News January 2, 2026
IIM బుద్ధగయలో నాన్ టీచింగ్ పోస్టులు

<
News January 2, 2026
వామకుక్షితో ఆరోగ్యం, ఆనందం

ఎడమ వైపు పడుకుంటే జీర్ణాశయం ఆకృతి కారణంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గుండెపై ఒత్తిడిని తగ్గించి, రక్తప్రసరణను సాఫీగా మారుస్తుంది. కాలేయం, కిడ్నీలు బాగా పనిచేసి వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఈ భంగిమ మెదడును చురుగ్గా ఉంచి, మధ్యాహ్నం వచ్చే అలసటను తగ్గిస్తుంది. గర్భిణీలకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. SHARE IT


