News September 20, 2025

ఒట్టిగెడ్డలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

వీరఘట్టంలోని వట్టిగెడ్డలో గుర్తుతెలియని మృతదేహం శనివారం లభ్యమైంది. బ్రిడ్జికి సమీపంలో ఈ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ జి.కళాధర్ తమ సిబ్బందితో వచ్చి వట్టిగెడ్డలో మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. ఎవరైనా చంపేసి పడేశారా, లేక ప్రమాదవశాత్తు గెడ్డలో పడి చనిపోయాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News September 20, 2025

రాష్ట్రంలో 9 పార్టీల తొలగింపు.. ఏవంటే?

image

TG: దేశవ్యాప్తంగా రెండో దశలో 474 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం <<17762955>>తొలగించిన<<>> విషయం తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 పార్టీలున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. లోక్‌సత్తా, ఆల్‌ ఇండియా ఆజాద్ కాంగ్రెస్, ఆల్‌ ఇండియా బీసీ ఓబీసీ, బీసీ భారత దేశం, భారత్ లేబర్ ప్రజా పార్టీ, మహాజన మండలి, నవభారత్ నేషనల్, TG ప్రగతి సమితి, TG ఇండిపెండెంట్ పార్టీలు ఉన్నాయన్నారు.

News September 20, 2025

మహిళా ఈ-హాత్‌ స్కీమ్ గురించి తెలుసా?

image

కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మహిళా ఈ హాత్‌ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. దీన్ని 2016లో ప్రారంభించారు. మహిళా ఈ-హాత్‌ ఒక ద్విభాషా మార్కెటింగ్‌ ప్లాట్‌ ఫామ్‌. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిలో 18 రకాల ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకోవచ్చు.

News September 20, 2025

HYD: అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో CP CV ఆనంద్

image

HYD CP CV ఆనంద్ అడిషనల్ మెజిస్ట్రేట్‌గా పనిచేశారు. తన కోర్టులో 11 రౌడీ గ్యాంగ్ కేసులు విన్నారు. వాటిలో 8 మందికి పీస్ బాండ్స్ ఎగ్జిక్యూట్ చేయించారు. పెద్దలు, స్నేహితులతో పరస్పర ప్రతీకారంతో కాకుండా, ఒకరిని మరొకరు హత్య చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. పాతబస్తీ తదితర ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం పెంపొందించేందుకు ఈ బాండ్స్ ఉపయోగపడతాయని చెప్పారు.