News March 16, 2025

ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయండి: గొట్టిపాటి

image

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం శుభాకాంక్షలు చెప్పారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. జీవితంలో ఉన్నత చదువులకు తొలి మెట్టు పదవ తరగతి అన్నారు. ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

Similar News

News March 17, 2025

బీసీ ఎమ్మెల్యేలతో మంత్రుల సమావేశం

image

బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య ,మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టనుండడంతో బిల్లు సజావుగా అన్ని పార్టీల మద్దతు ఇచ్చేలా మాట్లాడాలన్నారు.

News March 17, 2025

రాజేంద్రనగర్‌ NIRDPRలో రూ. లక్ష జీతంతో ఉద్యోగం

image

రాజేంద్రనగర్‌లోని NIRDPRలో కాంట్రాక్ట్ బేసిస్ కింద 33 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీటెక్, PG, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులు. వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,00,000, ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,40,000, ప్రోగ్రాం ఆఫీసర్‌రు రూ. 1,90,000 జీతం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు మార్చి 19 చివరి తేదీ.
SHARE IT

News March 17, 2025

ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లోనే రూ.24 కోట్లు

image

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.

error: Content is protected !!