News February 3, 2025
ఒమన్ దేశంలో జన్నారం వాసి మృతి

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 15, 2025
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: ఖమ్మం కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News September 15, 2025
రామగుండంలో పొలిటికల్ వార్.. BRS Vs CON

రామగుండం నియోజకవర్గంలో 4 రోజుల నుంచి పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, BRS పార్టీ నాయకుల మధ్య పోటా పోటీగా మాటల యుద్ధం నడుస్తోంది. పేద, మధ్యతరగతి వ్యాపారులను కూల్చివేతల పేరుతో నడిరోడ్డున పడేస్తున్నారని BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అంటూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
News September 15, 2025
బీ.ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో బీ.ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(Y18 నుంచి Y23 బ్యాచ్లు) థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి నిర్వహిస్తామని, పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 16లోపు, రూ.200 ఫైన్తో ఈ నెల 18లోపు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది. ఫీజు వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలంది.