News September 30, 2024
ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
ప్రయాణికులకు సమయాభావం తగ్గించేందుకు HYD ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని #TGSRTC యాజమాన్యం నిర్ణయించింది. మొదటి దశలో 2 ఈ-గరుడ బస్సులను నేడు ప్రారంభించనుంది. ఈ బస్సులు బీహెచ్ఈఎల్-రామచంద్రపురం, నిజాంపేట క్రాస్రోడ్స్, సైబర్ టవర్స్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు చేరుకుంటాయని సజ్జనర్ తెలిపారు.
Similar News
News September 30, 2024
BREAKING: HYD: కాసేపట్లో DSC ఫలితాలు విడుదల
DSC ఫలితాలు మరికొద్ది క్షణాల్లో విడుదల కానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 నెలల క్రితం పూర్తయిన DSC పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. కాగా, 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
News September 30, 2024
HYD: సామాన్యుడి బతుకుబండి బరువేక్కుతుంది..!
‘కూటి కోసం కోటి తిప్పలు’ అన్నట్లు పట్టణాలకు వలస వచ్చిన పేదల బతుకు బండి బరువెక్కుతోంది. చిన్నాచితక పనిలో రూ.10-15 వేల అరకొర జీతంతో కుటుంబాన్ని ముందుకు నడుపుతున్న వేళ కూరగాయల, నిత్యావసరాల ధరలు పెరగటంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు ఇంటి రెంట్, పిల్లల చదువులు, దవాఖాన ఖర్చులు ఇలా నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ మిగలడంలేదని సగటు వ్యక్తి ఆవేదన.
News September 30, 2024
HYD: కొండెక్కిన కూరగాయల ధరలు..!
HYDలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం 3 రోజుల్లోనే 20 % మేరకు ధరలు పెరిగినట్లు విక్రయదారులు తెలిపారు. ఉప్పల్ మార్కెట్లో టమాటా కిలో-70, వంకాయ-80 బెండకాయ-60, చిక్కుడు కాయ-60, దొండకాయ-60, పచ్చిమిర్చి-30, క్యాప్సికం-80 కాకరకాయ-60, గోరుచిక్కుడు-60, సొరకాయ ఒకటి 30-40, ఆలుగడ్డ-50-60, బీరకాయ- రూ.70-80గా ఉంది. నగరంలోని వివిధ మార్కెట్లలో రూ.10-20 వ్యత్యాసం ఉన్నట్లుగా పేర్కొన్నారు.