News March 24, 2024
ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711194986496-normal-WIFI.webp)
పదో తరగతి పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ శనివారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్థానిక నిర్మల్ హృదయ్ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం, త్రాగునీరు, కనీస మౌళిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎండల దృష్ట్యా వైద్య శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.
Similar News
News July 5, 2024
ఖమ్మం శివారు రైల్వే పట్టాలపై మృతదేహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720169435814-normal-WIFI.webp)
ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెం వద్ద రైల్వే పట్టాలపై ఓ గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఆయన మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ భాస్కర్ రావు పేర్కొన్నారు.
News July 5, 2024
వేరుశనగ నూనె ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720153170155-normal-WIFI.webp)
కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి.
News July 5, 2024
ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి తుమ్మల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720159113273-normal-WIFI.webp)
టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్ అయిన 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్స్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియామక పత్రాలు అందజేశారు. వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.