News March 6, 2025
ఓటమి మరింత బాధ్యతను పెంచింది: నరేందర్ రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తనకు మరింత బాధ్యతను పెంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్గా తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం మాత్రం తనదేనని, పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు.
Similar News
News December 20, 2025
జగిత్యాల: ప్రమాదాల నివారణకు ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్

రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం సంబంధిత అధికారులను ఆదేశించారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు రహదారి ప్రమాదాల నివారణకై తీసుకోవలసిన చర్యలపై పోటీలు నిర్వహించాలని సూచించారు. రహదారులపై సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2026 జనవరిలో చేపట్టనున్న రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణకు శాఖల వారీగా కార్యాచరణ తయారు చేయాలన్నారు.
News December 20, 2025
DMart ఫేక్ యాడ్.. ‘మహాభారత్’ నటుడి అకౌంట్ ఖాళీ!

మహాభారత్ సీరియల్లో ‘యుధిష్ఠిరుడు’ గజేంద్ర చౌహాన్ సైబర్ మోసానికి గురయ్యారు. FBలో DMart పేరుతో వచ్చిన ఫేక్ యాడ్ చూసి ఆయన డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేశారు. లింక్ నొక్కి OTP ఎంటర్ చేయగానే అకౌంట్ నుంచి ₹98,000 కట్ అయ్యాయి. ఆయన ఫిర్యాదుతో వెంటనే స్పందించిన ముంబై పోలీసులు డబ్బును రికవర్ చేశారు. ఆన్లైన్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.
News December 20, 2025
స్వచ్ఛతలో పశ్చిమను ప్రథమ స్థానంలో నిలుపుదాం: RRR

పశ్చిమ గోదావరి జిల్లాను రాష్ట్రంలోనే మొట్టమొదటి స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు యువత, ప్రజలు నడుం బిగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. శనివారం భీమవరంలో ‘పర్యావరణంలో అవకాశాలు’ అనే థీమ్తో నిర్వహించిన సదస్సులో ఆయన కలెక్టర్ నాగరాణితో కలిసి పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.


