News November 27, 2025
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: NZB కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో జరగనున్న పోలింగ్లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
Similar News
News November 28, 2025
NZB: 30న జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు

నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా స్థాయి సీనియర్ మహిళా, పురుషుల జిల్లా జట్ల ఎంపికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు ముప్కాల్లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో పాల్గొనే పురుషుల వ్యక్తిగత శరీర బరువు 85 kgలు, మహిళల వ్యక్తిగత శరీర బరువు 75 kgల లోపు ఉండాలన్నారు.
News November 28, 2025
NZB: 30న జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు

నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా స్థాయి సీనియర్ మహిళా, పురుషుల జిల్లా జట్ల ఎంపికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు ముప్కాల్లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో పాల్గొనే పురుషుల వ్యక్తిగత శరీర బరువు 85 kgలు, మహిళల వ్యక్తిగత శరీర బరువు 75 kgల లోపు ఉండాలన్నారు.
News November 27, 2025
NZB: జిల్లాలో తొలి రోజు నామినేషన్లు ఎన్ని అంటే?

నిజామాబాద్ జిల్లాలోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో మొదటి విడతలో GP ఎన్నికలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం వరకు దాఖలైన నామినేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి. 184 సర్పంచి స్థానాలకు సంబంధించి 140 నామినేషన్లు, 1,642 వార్డు స్థానాలకు సంబంధించి 96 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు.


