News January 24, 2025

ఓటర్ల దినోత్సవాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

image

కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మరో వైపు ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఉదయం 9 గంటలకు మానవహారం ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి రంగనాథ్ తెలిపారు.

Similar News

News September 17, 2025

జగిత్యాల: మహిళలు సంపూర్ణ ఆరోగ్యం సాధించాలి: ఎమ్మెల్యే

image

మహిళలు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్యం సాధించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మాతా శిశు కేంద్రంలో బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం చేపట్టిన స్వస్థనారి స్వసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషక విలువలపై కూడిన ఆహారం తీసుకోవాలని మహిళలకు సూచించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

News September 17, 2025

కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం తక్షణ చర్యలు: కోదండ రెడ్డి

image

కుండపోత వర్షాల వల్ల నష్టం జరగకుండా కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. సహాయక బృందాలు చర్యలు చేపట్టి 1,251 మందిని కాపాడాయన్నారు. వరదల వల్ల నష్టపోయిన 1,737 నివాస గృహాలకు రూ.1.85 లక్షల చొప్పున నష్టపరిహారం మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన ఆరుగురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామన్నారు.

News September 17, 2025

స్మృతి మంధాన సూపర్ సెంచరీ

image

AUSWతో జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగారు. 77బంతుల్లో 12ఫోర్లు, 4సిక్సర్లతో శతకం బాదారు. దీంతో IND తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు. తొలి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఆమె పేరిటే ఉండటం విశేషం. గతంలో స్మృతి ఐర్లాండ్‌పై 70 బంతుల్లోనే శతకం నమోదు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన IND టీమ్ 32 ఓవర్లలో 191/3 రన్స్ చేసింది. క్రీజులో స్మృతి, దీప్తి శర్మ(12) ఉన్నారు.