News August 26, 2025
ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్న ఎంపీ కావ్య

బీహార్ రాష్ట్రంలోని సుపాల్లో నిర్వహించిన ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వరంగల్ ఎంపీ కావ్య పాల్గొన్నారు. బీహార్లో నితీశ్ కుమార్-బీజేపీ పాలనతో ప్రజలు విసిగి పోయారన్నారు. ఉద్యోగాలు లేక, వలసలు పెరిగాయని, ప్రజలు ఇండియా కూటమి వైపు చూస్తున్నారని ఎంపీ అన్నారు.
Similar News
News August 27, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ పేర్ని నానిపై ఏలూరు పోలీసుల కేసు నమోదు
☞ మచిలీపట్నం: సులభతర వాణిజ్యంపై కలెక్టర్ వర్క్ షాప్
☞ కృష్ణా జిల్లాలో వేగవంతంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
☞ మచిలీపట్నం- నరసాపురం జాతీయ రహదారిపై ప్రమాదం
☞ అవనిగడ్డ: పడవలో మృతదేహం
☞ మచిలీపట్నంలో జనసేన నేత సస్పెండ్
News August 27, 2025
క్యాబినెట్ భేటీ 30కి వాయిదా

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈనెల 29న క్యాబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. దాన్ని ఈనెల 30కి రీషెడ్యూల్ చేసింది. ఆ రోజు మ.ఒంటి గంటకు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం సమావేశం కానుంది. కాగా అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
News August 27, 2025
VKB: విత్తన గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

విత్తన గణపతిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుందామని మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. వికారాబాద్లోని ఎన్ఎస్పీ కార్యాలయంలో ఆయన విత్తన గణపతి విగ్రహాలను మంగళవారం పంపిణీ చేశారు. గణపతి భక్తితో పాటుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విత్తన గణపతిని నీటిలో నిమజ్జనం చేయడంతో అది మొక్కగా పెరిగి సమాజానికి నీడను ఇస్తుంద తెలిపారు.