News March 21, 2024

ఓటర్ జాబితాలో ముందే పేర్లు చూసుకోవాలి : కలెక్టర్

image

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో వారి పేర్లను ముందే చూసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన కోరారు. బుధవారం ఆమె నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హాలియాలో ఏర్పాటు చేయనున్న పార్లమెంటు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రం సైతం ఎక్కడుందో చూసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

Similar News

News April 20, 2025

NLG: ప్రతి మూడో ఆదివారం.. బుద్ధవనం టూర్!

image

టూరిజం శాఖ సహకారంతో ప్రతిమ ట్రావెల్స్ ఆధ్వర్యంలో HYD నుంచి నాగార్జునసాగర్‌కు ప్రతి నెలా మూడో ఆదివారం ప్రత్యేకంగా పర్యాటకులకు నాగార్జునసాగర్ టూర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు బుద్ధవనం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు HYD నుంచి బయల్దేరి నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధవనం, నాగార్జునకొండలను సందర్శించిన అనంతరం రాత్రి 9 గంటల వరకు HYDకు పర్యాటకులను చేర్చుతారని తెలిపారు

News April 20, 2025

MGU తరఫున ప్రాతినిధ్యం వహించనున్న ప్రవళిక

image

ఒరిస్సా కళింగ విశ్వవిద్యాలయం వేదికగా జరగనున్న ఇండియన్ యూనివర్సిటీస్ ఎంపికలకు మహిళా విభాగం 100, 200 మీటర్ల పరుగు పందేనికి NLG సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎన్.ప్రవళిక MGU తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇవాళ ఉదయం విశ్వవిద్యాలయంలో జరిగిన ఎంపికల్లో ప్రవళిక 100 మీటర్ల పరుగు పందెంలో 12.30 సెకండ్లలో, 200 మీటర్ల 25.60 సెకండ్లలో పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

News April 20, 2025

అమృత్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి:కలెక్టర్ 

image

హాలియా మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శనివారం ఆమె నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డితో కలిసి హాలియా మున్సిపల్ కార్యాలయంలో అమృత్ పథకం కింద చేపట్టిన తాగునీటి పనులపై ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌లతో సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!