News May 11, 2024

ఓటుకు నోటు.. ఒంగోలులో రూ.3 వేలు.?

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటితో ప్రచార పర్వం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఒంగోలు, దర్శి నియోజకవర్గాల్లో రూ.3వేలు ఇస్తున్నట్లు సమాచారం. గిద్దలూరు, మార్కాపురం, చీరాల, అద్దంకి 2000 ఇస్తున్నారట. కాగా కొండపి, కనిగిరి, వై.పాలెంలో ఓటుకు 1500-2000 ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అటు ఇలాంటివి కట్టడి చేసేందుకు ఈసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

Similar News

News December 19, 2025

ప్రకాశం హార్బర్ కోసం CM ప్రత్యేక చొరవ.!

image

ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయదలచిన ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని CM చంద్రబాబు శుక్రవారం కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌ను కోరారు. సాగరమాల పథకం కింద ఫిషింగ్ హార్బర్ కొత్తపట్నం వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాగరమాల పథకం ద్వారా రూ.150 కోట్లు మంజూరు చేయాలని CM కోరారు.

News December 19, 2025

ప్రకాశం: 18 మంది కార్యదర్శులకు నోటీసులు.!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 18 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు డీపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. పంచాయతీలకు సంబంధించి ఇంటి పన్నులను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో కార్యదర్శులకు ఈ నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. నోటీసులు అందిన మూడు రోజుల్లోగా రాత పూర్వకంగా తమకు సమాధానం ఇవ్వాలని డీపీఓ ఆదేశించారు.

News December 19, 2025

ప్రకాశంలో పెద్ద మిస్టరీ.. 38408 కార్డుల కథేంటి..?

image

ప్రకాశం జిల్లాలో 38408 స్మార్ట్ రేషన్ కార్డుల యాజమానుల కోసం ఎదురుచూపుల్లో ఉన్నాయని అధికారుల వద్ద ఉన్న లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోనియెడల త్వరలో సరెండర్ చేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు.