News May 13, 2024
ఓటు వేసిన విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక

విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక సోమవారం విజయనగరం పట్టణం తోటపాలెంలో గల ఎం.ఎస్.ఎన్. కళాశాల పోలింగు కేంద్రంలో సామాన్య ఓటర్లతో పాటు క్యూ లైనులో నిలబడి, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ కూడ రాజ్యాంగబద్ధమైన తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News September 27, 2025
అక్టోబర్ 1న జిల్లాకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు అక్టోబర్ 1న జిల్లాలో పర్యటించనున్నారు. దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామాన్ని సందర్శించి పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జేసీ సేతుమాధవన్, డీఎస్పీ రాఘవులు, తదితరులు హెలీ ప్యాడ్, సభావేదికకు సంబందించి ఏర్పాట్లును శనివారం పరిశీలించారు. పర్యటనకు సంబందించి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.
News September 27, 2025
విచారణ వేగవంతానికి ఈ-సమన్స్ అమలు చేయాలి: VZM SP

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్
అధికారులు, హెచ్సీలతో SP దామోదర్ శనివారం జూమ్ మీటింగు నిర్వహించారు. నమోదైన కేసుల్లో నిందితులకు న్యాయ స్థానాల్లో శిక్షపడేలా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్ సిబ్బంది పాత్ర క్రియాశీలకమన్నారు. కేసుల విచారణ మరింత వేగవంతంగా జరిపించేందుకు ఈ-సమన్స్ అమలు చేయాలన్నారు.
News September 27, 2025
వర్షాలను దృష్టిలో ఉంచుకొని పండగ ఏర్పాట్లు: RDO

వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పైడితల్లి పండగ ఏర్పాట్లను చేసుకోవాలని RDO దాట్ల కీర్తి తెలిపారు. శనివారం తన ఛాంబర్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. గుడి లోపల దేవస్థానం సిబ్బంది ఎక్కువ మంది ఉండడంతో భక్తుల తోపులాట జరుగుతోందన్నారు.