News December 13, 2025

ఓటేయడానికి వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

TG: రేపు పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. HYD, ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు సొంతూళ్లకు ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు బైకులపైనే వెళ్తుండటంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురై స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రమాదం మెదక్(D) పెద్దశంకరంపేటలో జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు.

Similar News

News December 19, 2025

విజయవాడ కృష్ణానదిలో హౌస్ బోట్లు!

image

AP: పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కేరళ స్టైల్ లగ్జరీ హౌస్ బోట్లను విజయవాడ కృష్ణానదిలో తిప్పాలని యోచిస్తోంది. వీటిలో ఏసీ, లగ్జరీ బెడ్ రూమ్, అటాచ్డ్ బాత్ రూమ్, డైనింగ్ స్పేస్ ఉంటాయి. పర్యాటకుల సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్లతో పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. తొలి విడతలో 20 హౌస్ బోట్లు తీసుకువచ్చే అవకాశం ఉంది. రాత్రంతా ఉండేందుకు స్పెషల్ ప్యాకేజీలు ఉండనున్నాయి.

News December 19, 2025

ఆ రోజే సూసైడ్ చేసుకోవాల్సింది: హీరోయిన్

image

మలయాళ హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్ <<18547134>>కేసులో<<>> ఆరుగురికి 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. నిందితుల్లో ఒకరైన మార్టిన్ ఆంటోనీ బాధితురాలి ఐడెంటిటీని వెల్లడించడంపై ఆ హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నన్ను ఇలా బతకనివ్వండి. ఘటనపై ఫిర్యాదు చేసి తప్పు చేశా. ఆ రోజే నేను చనిపోవాల్సింది. మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. తన పేరు వెల్లడించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News December 19, 2025

చెన్నై టీమ్‌కు నాసా ‘మోస్ట్ ఇన్‌స్పిరేషనల్ అవార్డు’

image

నాసా 2025 ఇంటర్నేషనల్ స్పేస్ యాప్స్ ఛాలెంజ్‌లో చెన్నై ఫొటోనిక్స్ ఒడిస్సీ టీమ్‌ మోస్ట్ ఇన్‌స్పిరేషనల్ అవార్డును గెలిచింది. ఇండియాలో ఇంటర్నెట్ లేనిచోట హైస్పీడ్ కనెక్టివిటీ కోసం ప్రత్యేక శాటిలైట్ ఇంటర్నెట్ విధానాన్ని వీళ్లు ప్రతిపాదించారు. ఈ పోటీలో 167 దేశాల నుంచి దాదాపు 1.14 లక్షల మంది పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్ ఇతర విభాగాల్లో గెలుపొందిన వారిలో భారత సంతతికి చెందినవాళ్లు పెద్ద సంఖ్యలో ఉండటం విశేషం.