News May 21, 2024

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు కలెక్టర్, ఎస్పీ

image

జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కలెక్టర్ శ్రీకేశ్, ఎస్పీ మలికా గర్గ్‌తో కలిసి నరసరావుపేట జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్, రిటర్నింగ్ అధికారి రమణ కాంత్ రెడ్డి, సరోజ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 8, 2025

గుంటూరు: ఇసుక నిల్వలు సిద్ధం

image

గుంటూరు జిల్లాలో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా 3.5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఇసుకను కృష్ణానదిలో నుంచి తరలించి స్టాకు పాయింట్లలో నిల్వ చేశారు. లింగాయపాలెం-1, 2, బోరుపాలెం, గుండిమెడలపైగా చౌడవరం, పెదకాకాని, ప్రాతూరులో మాన్సూన్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వరదలతో మైనింగ్ ఆగినా ప్రజలకు ఇసుక కొరత తలెత్తదని సమాచారం. ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

News July 8, 2025

గుంటూరు మిర్చికి జాతీయ గుర్తింపు

image

ఓడీఓపీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన మిర్చిపై రూపొందించిన సమగ్ర నివేదికకు కేంద్ర వాణిజ్య శాఖ జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. జిల్లా ఉద్యాన శాఖ ప్రణాళికా ఆధారంగా రూపొందించిన నివేదిక రాష్ట్ర స్థాయిలో ఎంపికై, దేశంలోని ఏడు ఉత్తమ నివేదికలలో స్థానం సంపాదించింది. జులై 14న ఢిల్లీలో కలెక్టర్ నాగలక్ష్మి అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

News July 7, 2025

పేరెంట్స్-టీచర్ మీటింగ్‌కు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 10న పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం విద్యాసంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపే ప్రక్రియను సోమవారం మధ్యాహ్నానికే పూర్తి చేయాలని సూచించారు.