News June 2, 2024
ఓట్ల లెక్కింపు ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్

NLG- KMM- WGL శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి, NLG- KMM- WGL శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అన్నారు. శనివారం ఉదయాదిత్య భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 12 జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఏఆర్ఓలకు ఓట్ల లెక్కింపు పై ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Similar News
News February 24, 2026
NLG: సొంతింటి కల.. పాలకుల మాయాజాలం!

రాజకీయ చదరంగంలో పేదల సొంతింటి కల కేవలం ఓటు బ్యాంకు పావుగా మారుతోంది. ఎన్నికల వేళ హామీల వర్షం కురిపిస్తున్న పాలకులు, తీరా గెలిచాక ఆ ఇళ్లను గాలికొదిలేస్తున్నారు. నల్గొండలో కోట్ల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలు నేడు పాలకుల నిర్లక్ష్యంతో పాడుబడుతున్నాయి. చూడ్డానికి కోటలా ఉన్నా, నివసించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులకు అందక ఈ ఇళ్లు నేడు శిథిలావస్థకు చేరుతున్నాయి.
News February 24, 2026
NLG: గృహలక్ష్మి లబ్ధిదారులకు ‘ఇందిరమ్మ’ ఊరట

గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద బేస్మెంట్ స్థాయి వరకు ఇళ్లు నిర్మించుకుని, నిధులు అందక నిలిచిపోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. వీరిని ఇందిరమ్మ ఇళ్ల పథకంలోకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. బేస్మెంట్ వరకు కట్టిన వారికి లక్ష రూపాయలు మినహాయించి, మిగిలిన నాలుగు లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించనుంది.నల్గొండ జిల్లాలో 150 మందికి ఈ అవకాశం కల్పించారు.
News February 24, 2026
NLG: రైస్ మిల్లర్లపై పోలీసు కేసుల కలకలం!

జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు కన్నెర్ర చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా అక్రమాలకు పాల్పడిన పలువురు మిల్లర్లపై రెండు రోజుల నుంచి వరుసగా కేసులు నమోదు చేయించడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బియ్యం మాయం చేసినట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వెనువెంటనే ఎఫ్.ఐ.ఆర్లు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.


