News July 17, 2024

ఓడీఎఫ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ రఘునందన్

image

ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్(ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం ఆయన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడి ఇన్ఫెక్షన్ బంగ్లాలో సీజీఎం శివశంకర ప్రసాద్, జీఎం లతోపాటు ఇతర ప్రతినిధులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. ఓడీఎఫ్ సమస్యలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వివరిస్తానని రఘునందన్ అన్నారు.

Similar News

News February 20, 2026

ఇంటర్ పరీక్షలకు మెదక్ జిల్లా విద్యార్థులు సిద్ధం

image

* ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల
* పరీక్షకు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్య: 12,334
* ప్రథమ సంవత్సరం 6,309 (ఒకేషనల్ 599)
* ద్వితీయ సంవత్సరం 6,025 (ఒకేషనల్ 553)
* జిల్లాలో మొత్తం పరీక్ష కేంద్రాలు : 28
* అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు నిఘా
* పరీక్షకు ఒకరోజు ముందే హాల్ టికెట్, పెన్నులు, యాడ్ తదితరవి సిద్ధం చేసుకోండి
పరీక్షలంటే టెన్షన్ వద్దు.. ఒత్తిడిని జయిస్తే మీదే విజయం

News February 20, 2026

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: మెదక్ కలెక్టర్

image

10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో ప్రత్యేక తరగతులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. బట్టి పద్ధతికి దూరంగా ఉండి అంశాలపై పట్టు సాధించాలని, ప్రతిరోజూ ప్రత్యేక తరగతులకు హాజరుకావాలని సూచించారు. టీవీ, మొబైల్, సోషల్ మీడియాలకు దూరంగా ఉండి ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు.

News February 20, 2026

ఎడ్యుకేషనల్ హబ్‌గా సిద్దిపేట అభివృద్ధి: హరీశ్ రావు

image

సిద్దిపేటను మెడికల్, పారామెడికల్ కాలేజీలు, ఐటీ టవర్‌తో అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దామని MLA హరీశ్ రావు తెలిపారు. ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్’ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తున్నామని చెప్పారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, మొబైల్ వ్యసనాలకు దూరంగా కష్టపడి చదివితే పేదరికం అడ్డుకాదని సూచించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు.