News July 17, 2024

ఓడీఎఫ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ రఘునందన్

image

ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్(ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం ఆయన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడి ఇన్ఫెక్షన్ బంగ్లాలో సీజీఎం శివశంకర ప్రసాద్, జీఎం లతోపాటు ఇతర ప్రతినిధులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. ఓడీఎఫ్ సమస్యలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వివరిస్తానని రఘునందన్ అన్నారు.

Similar News

News November 3, 2025

మెదక్: చేవెళ్ల ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి

image

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. పేషెంట్ల కండీషన్‌ను డాక్టర్లు మంత్రికి వివరించారు. ఒక్కరికి మాత్రమే హెడ్ ఇంజురీ కాగా, ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. అందరికీ మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. వైద్య ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. బాధితులతో మాట్లాడిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ధైర్యం చెప్పారు.

News November 3, 2025

మెదక్: రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

image

ఈ నెల 3 నుంచి 30 వరకు మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.

News November 3, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కాలినడకన వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. కాలినడకన వెళ్తున్న చేగుంటకు చెందిన కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.