News March 28, 2025
ఓదెల మల్లన్న ఆలయ హుండీ ఆదాయం రూ.33,59,130

ఓదెల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయ హుండీ లెక్కింపును నిర్వహించారు. 3 నెలల ఆదాయం రూ.33,59,130, మిశ్రమ బంగారం 40.900 గ్రాముల, 7.200 కేజీల వెండి వచ్చిందని ఆలయ ఈవో సదయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక అధికారి శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, అర్చకులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, రాజరాజేశ్వర సేవా సమితి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 5, 2025
ఇతిహాసాలు క్విజ్ – 57

1. శబరి ఏ ఆశ్రమంలో రాముడి కోసం ఎదురుచూసింది?
2. విశ్వామిత్రుడి శిష్యులలో ‘శతానందుడు’ ఎవరి పుత్రుడు?
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ఏంటి?
4. నారదుడు ఏ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు?
5. కాలానికి అధిపతి ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 5, 2025
నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు

తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో 21 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఫిల్, పీహెచ్డీ, పీజీ, NET, SLET, SET, MLISC, B.Ed, డిగ్రీ, ఇంటర్ , టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://nsktu.ac.in
News November 5, 2025
గ్రేటర్ వరంగల్ వరద ముప్పు నివారణకు సమగ్ర ప్రణాళికలు

గ్రేటర్ వరంగల్ను వరద ముంపు ముప్పు నుంచి శాశ్వతంగా రక్షించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో జరిగిన సమీక్షలో నాలాలు, డ్రైన్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, రిటైనింగ్ వాల్స్ నిర్మాణంపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిపుణుల సలహాలతో పటిష్ఠ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.


