News August 10, 2025
ఓపన్ వర్సిటీ PhD అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పలు సబ్జెక్టుల్లో పీహెచ్డీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పుష్పా చక్రపాణి తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లేట్ ఫీతో సెప్టెంబర్ 4 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. వివరాలకు 040–23544741, 23680411 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News August 10, 2025
HYD: గ్యాస్ సబ్సిడీ రాట్లే సార్.. ఏం చేయాలి?

రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపింది. కానీ.. గ్రేటర్ వ్యాప్తంగా లక్షల్లో లబ్ధిదారులు అర్హులైనప్పటికీ తమకు సబ్సిడీ అందటం లేదని, GHMC కార్యాలయాల వద్ద అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ప్రజాపాలనలో తాము దరఖాస్తు చేసుకున్నామని, 200 యూనిట్ల ఉచిత కరెంటు వస్తున్నప్పటికీ గ్యాస్ సబ్సిడీ రావడం లేదని ఉప్పల్ GHMC ఆఫీస్ వద్ద పలువురు వాపోయారు. మీకు సబ్సిడీ రావడంలేదా? కామెంట్ చేయండి.
News August 10, 2025
‘రాఖీ’ రోజే సోదరిని కోల్పోయిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పౌర్ణమి నాడే ఇబ్రహీంపట్నం MLA ఇంట విషాదం నెలకొంది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శనివారం తన సోదరి మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంగేటి భూదేవి నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ రోజు వారి స్వగ్రామం తొర్రూరులో అంత్యక్రియలు జరుగుతాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
News August 10, 2025
HYD- నాగ్పూర్ వందేభారత్ ట్రైన్కు ఆదరణ అంతంతే!

కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన HYD- నాగ్పూర్ వందేభారత్ ట్రైన్కు ఆదరణ అంతంత మాత్రమే లభిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరి 19న ఈ ట్రైన్ను 20 కోచ్లతో ప్రారంభించారు. అయితే ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కోచ్ల సంఖ్య ఒక్కసారిగా 8కి తగ్గించారు. అయినా ఆక్యుపెన్సీ రేషియో 70% మాత్రమే ఉంది. డిమాండ్లేని ఈ రూట్లో ట్రైన్ ప్రారంభించడంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు చెబుతున్నారు.