News October 31, 2025
ఓపెన్ స్కూల్ 10TH, ఇంటర్ ఫలితాలు విడుదల.. ములుగు జిల్లా టాప్!

ఈ ఏడాది SEPTలో నిర్వహించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను రాష్ట్ర ఓపెన్ స్కూల్ డైరెక్టర్ విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణత సాధించింది. 10THలో 87.50%, ఇంటర్లో 70.08% ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. హనుమకొండలో టెన్త్ 77.14%, వరంగల్లో 31.18%, మహబూబాబాద్లో 78.95% సాధించారు. రీవెరిఫికేషన్కు NOV 4 నుంచి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Similar News
News October 31, 2025
5 కేజీల భారీ నిమ్మకాయలను పండిస్తున్న రైతు

నిమ్మకాయ బాగా పెరిగితే కోడిగుడ్డు సైజులో ఉంటుంది. అయితే కర్నాటకలోని కొడుగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి అనే రైతు భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఇవి ఒక్కోటి పెద్ద సైజులో 5 కేజీల వరకు బరువు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మైసూరు వెళ్లినప్పుడు అక్కడ మార్కెట్లో నిమ్మ విత్తనాలను కొని తన కాఫీ తోటలో సుబ్రమణి నాటారు. మూడేళ్ల తర్వాత నుంచి వాటిలో 2 మొక్కలకు ఈ భారీ సైజు నిమ్మకాయలు కాస్తున్నాయి.
News October 31, 2025
చిత్తూరు మేయర్ హత్య కేసు వివరాలు ఇలా..!

➤ హత్య జరిగిన తేది: 2015 నవంబర్ 17
➤ హత్య జరిగిన ప్రాంతం: చిత్తూరు కార్పొరేషన్ ఆఫీస్
➤ తుపాకీ కాల్పులకు అనురాధ మృతి
➤ కత్తులతో పొడవడంతో మోహన్ మృతి
➤ 130 మంది సాక్షుల విచారణ
➤ 352 సార్లు వాయిదా పడిన కేసు
➤ ఉరిశిక్ష పడింది: చింటూ(A1), వెంకట చలపతి(A2), జయ ప్రకాష్ రెడ్డి(A3), మంజు నాథ్(A4), వెంకటేశ్(A5)
News October 31, 2025
పాడేరు: మీకోసం కార్యక్రమానికి 135 ఫిర్యాదులు

పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో కలిసి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


