News October 29, 2025

ఓపెన్ SSC, INTERలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలి

image

గద్వాల జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ సునీతమ్మ బుధవారం తెలిపారు. ఈనెల 31లోగా (ఫైన్‌తో) www.telanganaopenschool.org దరఖాస్తులు చేసుకోవాలన్నారు. చదువు మానేసిన జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News October 30, 2025

వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

image

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్‌.ఎన్‌. నగర్‌లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

News October 30, 2025

మేడిపల్లి: కులం పేరుతో దూషించి దాడి.. వ్యక్తికి జైలు

image

మేడిపల్లి మండలం కల్వకోటకి చెందిన గోడ వెంకటిపై కులం పేరుతో దూషించి దాడి చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన ఆదె చందుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కరీంనగర్ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నీరజ తీర్పునిచ్చారు. 2020 జనవరి 21న బర్రెను ఢీకొట్టిన ఘటనపై మాటామాటా పెరిగి చందు వెంకటిని తిడుతూ దాడి చేశాడు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను SP అశోక్ కుమార్ అభినందించారు.

News October 30, 2025

మంచిర్యాల: ‘తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలి’

image

జిల్లాలోని రైతులు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చివరి దశలో నష్టపోతుండటంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. దీనితో ప్రతి సంవత్సరం అప్పుల పాలవుతున్నామని, తమను ఆదుకోవడానికి రాష్ట్రంలో తక్షణమే ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.