News October 15, 2025
ఓయూ రిజిస్ట్రార్కు ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు

ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డికి ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు లభించింది. ద ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్(ఐఏఏ) నిర్వహించిన 47వ ఆల్ ఇండియా అకౌంటింగ్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ ఘనత సాధించారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జనార్దన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్(డీమ్డ్ యూనివర్సిటీ)లో ఈనెల 12, 13 తేదీల్లో ఈ సదస్సు జరిగింది.
Similar News
News October 15, 2025
HYD: ‘₹4,000 పెన్షన్ వస్తుందా!.. అందిరికీ తెల్సిందేగా’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ప్రచారం ఉపందుకుంది. మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎర్రగడ్డ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళను ₹4,000 పెన్షన్ వస్తుందా? అని అడగ్గా ఆమె నవ్వుతూ ‘అందరికీ తెలిసిందేగా’ అని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ కాంగ్రెస్ మాటలను నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.
News October 15, 2025
HYD: రైళ్లలో బాణసంచా.. తీసుకెళ్తే తప్పదిక శిక్ష

దీపావళి సందర్భంగా రైల్వే శాఖ అప్రమత్తమైంది. బాణసంచాను రైల్లో తీసుకెళ్లొద్దని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను హెచ్చరిస్తోంది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 164, 165 ప్రకారం రూ.1000 వరకు జరిమానా లేదా 3ఏళ్ల జైలు శిక్ష, రెండూ వర్తించే అవకాశం ఉందంటున్నారు. ఎవరైనా రైల్లో తీసుకెళ్తే RPF పోలీసులకు లేదా 139 నంబర్కు సమాచారం అందించాలని రైల్వే అధికారులు సూచించారు..
News October 15, 2025
జూబ్లీలో వేడి రాజుకుంది.. బీజేపీ గమ్మునుంది

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి రాజుకుంది. కానీ ఈ పోరులోకి BJP ఎంట్రీ ఇవ్వకపోగా అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ముగ్గురు పేర్లు చీఫ్ రాంచందర్రెడ్డి, అగ్రనేతలు షార్ట్లిస్ట్ చేశారు. వీరిలో దీపక్రెడ్డి, కీర్తిరెడ్డి, డా.పద్మ పేర్లు ఉన్నట్లు సమాచారం. బీసీ నేత అయితే బాగుంటుందని ఢిల్లీ పెద్దల యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ప్రకటనపై పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.