News January 9, 2026
ఓరుగల్లు ప్రజల పక్షాన పోరాడుతున్నారు: దాస్యం

రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఓరుగల్లు ప్రజల పక్షాన పోరాడుతున్నారని BRS హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. బాలసముద్రం BRS ఆఫీసులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో దాస్యం మాట్లాడుతూ… రానున్న రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్దామని, BRS పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
Similar News
News February 3, 2026
గద్వాల జిల్లాలో 285 క్యాన్సర్ కేసులు నమోదు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లా ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ దాస్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 285 క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 131 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. డే కేర్ సెంటర్ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News February 3, 2026
ప.గో: తల.. మొండెం వేరు వేరుగా

ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులో నమ్మి రాంబాబు(22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న రాంబాబు మృతదేహం మంగళవారం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. మృతదేహం పక్కనే చీర వేలాడుతుండగా.. మొండెం నుంచి తల వేరుపడి ఉంది. సుమారు ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
News February 3, 2026
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం

ఒకే ఆటగాడు రెండు దేశాల తరఫున క్రికెట్ ఆడిన ఘటనలు గతంలో చూశాం. కానీ రెండు దేశాల తరఫున వేర్వేరు క్రీడల్లో వరల్డ్ కప్లో పాల్గొన్న అరుదైన ఘట్టం తొలిసారి చోటుచేసుకోనుంది. 2006లో సౌతాఫ్రికా తరఫున హాకీ వరల్డ్ కప్ ఆడిన వేన్ మ్యాడ్సన్ 20 ఏళ్ల తర్వాత ఇటలీ T20 WC కెప్టెన్గా బరిలో దిగనున్నారు. ఈయన గతంలో PSL, BPL, హండ్రెడ్ లీగ్లలోనూ పాల్గొన్నారు. ఇటలీ తరఫున 2023లో అరంగేట్రం చేశారు.


