News February 7, 2025
ఓర్వకల్లు వద్ద ఘోర ప్రమాదం.. UPDATE
ఓర్వకల్లు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులు జానకి(60), విహారిక(4) కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది.
Similar News
News February 7, 2025
కరీంనగర్: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు
KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
News February 7, 2025
జగన్ ‘క్యారెక్టర్’ కామెంట్స్.. స్పందించిన VSR
AP: రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం అంటూ YS జగన్ చేసిన <<15377485>>వ్యాఖ్యలపై<<>> మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా’ అని ట్వీట్ చేశారు.
News February 7, 2025
కరీంనగర్: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు
KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.