News March 26, 2024

కంకిపాడు: విద్యాసంస్థలో బాలిక మృతి

image

కంకిపాడులోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న బాలిక అకస్మాత్తుగా మృతి చెందింది. త్రిపురకి చెందిన విద్యార్థిని క్యాంపస్‌లో హాస్టల్ నుంచి క్లాస్ రూంకి స్నేహితులతో కలిసి మంగళవారం వెళ్తుండగా అకస్మాత్తుగా పడిపోయింది. కాలేజీ స్టాఫ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు కంకిపాడు ఎస్సై సందీప్ తెలిపారు.

Similar News

News July 5, 2024

విజయవాడ: నేటి నుంచి తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు

image

తిరుమల ఎక్స్ ప్రెస్‌ను జులై 5 నుంచి 11వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రాజమండ్రి మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరారు.

News July 5, 2024

NTR: పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య

image

NTRజిల్లా కంభంపాడుకి చెందిన శేషుకుమార్‌‌కి TG మహబూనగర్ జిల్లా శిర్సనగండ్లకు చెందిన రాజశ్రీ(29)తో 2014లో పెళ్లయింది. 10ఏళ్లయినా పిల్లలు పుట్టడం లేదని ఇద్దరూ గొడవపడుతూ ఉండేవారు. దీంతో మనస్తాపం చెందిన రాజశ్రీ ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా మాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ..బుధవారం రాత్రి మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News July 5, 2024

కృష్ణమ్మకు సిద్ధమైన మరో మణిహారం

image

విజయవాడ పశ్చిమ బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా సూరాయపాలెం వద్ద కృష్ణా నదిపై భారీ వంతెన కడుతున్నారు. ఈ వంతెన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. NHAIఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ వంతెన చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్, ఏలూరు నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా గొల్లపూడి మీదుగా కాజ వద్ద చెన్నై హైవేను చేరుకోవచ్చు.