News April 24, 2024
కంటతడి పెట్టిన కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదిత

కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం రాత్రి జరిగిన BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. తన తండ్రి, సోదరిని తలుచుకొని నివేదిత కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నివేదితను గెలిపించుకోవాలని మల్లారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.
Similar News
News December 22, 2025
HYDలో పెరుగుతున్న కేసులు.. జర భద్రం!

వర్షాకాలంలో భయపెట్టే డెంగ్యూ ఈసారి చలికాలంలోనూ వణుకు పుట్టిస్తోంది. DEC నెలలోనూ డెంగ్యూ కేసులు పెరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. 10రోజుల్లో నగరంలో 4పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క NOVలోనే 90కిపైగా డెంగ్యూ, వైరల్ జ్వరాల కేసులు ఫీవర్ ఆస్పత్రికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలన్నారు. దోమల నివారణకు అధికారుల చర్యలేవని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
News December 22, 2025
HYD: 10th విద్యార్థులకు ఇదే లాస్ట్ ఛాన్స్

10th విద్యార్థలకు ఇదే లాస్ట్ ఛాన్స్.. నామినల్ రోల్స్లో ఏమైనా తప్పులుంటే కరెక్షన్ చేసుకోవాలని నాంపల్లిలోని SSC బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 30 వరకు మాత్రమే అవకాశముందని బోర్డు డైరెక్టర్ పీవీ.శ్రీహరి తెలిపారు. తల్లిదండ్రులూ పాఠశాలలకు వెళ్లి పరిశీలించాలని కోరారు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులే ఇందుకు బాధ్యత వహించాలని ఆదేశించారు.
News December 22, 2025
ఆల్ ఇండియా కామర్స్ సదస్సులో TG అధ్యాపకుడికి గోల్డ్ మెడల్

బెంగుళూరులో జరిగిన 76వ ఆల్ ఇండియా కామర్స్ సదస్సులో తెలంగాణకు చెందిన డాక్టర్ రామకృష్ణకు గోల్డ్ మెడల్ లభించింది. ఓయూ పూర్వ విద్యార్థి అయిన రామకృష్ణ ప్రస్తుతం కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇండోజీనియస్ ట్రైబల్ కమ్యూనిటీని డిజిటల్ ఎకానమీలో సమీకరించడంపై సమర్పించిన పరిశోధనా పత్రం ఉత్తమంగా ఎంపికైంది.


