News July 5, 2025

కండక్టర్‌పై దాడి కేసులో ఇద్దరికి జైలు శిక్ష: సీఐ చిట్టిబాబు

image

ఆర్టీసీ కండక్టర్ విధులకు ఆటంకం కలిగించి, దాడి చేసిన ఇద్దరికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో తోట్లవల్లూరు నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు కండక్టర్ సుదీర్‌పై వీరభద్రరావు, ప్రదీప్ కుమార్ దాడి చేశారు. ఈ ఘటనలో కోర్టు వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది.

Similar News

News July 5, 2025

డొంకేశ్వర్ మండలం నుంచి 41 మంది IIITకి ఎంపిక

image

డొంకేశ్వర్ మండలం నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఇందులో డొంకేశ్వర్ ZPHSకు చెందిన 26 మంది విద్యార్థులు ఉండటం విశేషం. 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. తొండాకూర్ ZPHS నుంచి 9, నికాల్పూర్ ZPHS ఐదుగురు, గాదేపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. డొంకేశ్వర్ పాఠశాల హెచ్ఎం సురేశ్, తొండాకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

News July 5, 2025

‘తమ్ముడు’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

image

నితిన్ హీరోగా దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘తమ్ముడు’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో రూ.2 కోట్ల కలెక్షన్లు వచ్చాయని వెల్లడించాయి. ఈ చిత్రానికి మొదటి రోజు 27 వేలలోపే టికెట్స్ అమ్ముడుపోయాయని పేర్కొన్నాయి. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఉదయం షోలతో పోల్చితే సాయంత్రానికి ఆక్యుపెన్సీ తగ్గినట్లు తెలిపాయి.

News July 5, 2025

మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం

image

TG: మహిళలకు 5 వేల ఎలక్ట్రిక్ ఆటోలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటి వల్ల హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గుతుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను మహిళా సంఘాలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకం విజయవంతం కావడం కోసం RTC డ్రైవర్లు, కండక్టర్లు చాలా కష్టపడుతున్నారని తెలిపారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, నియామకాలూ చేపడతామన్నారు.