News August 20, 2025

కంది ఐఐటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లకు ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదారాబాద్‌లో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగంలో ప్రత్యేక రౌండ్ పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి స్పాన్సర్ చేసిన ప్రాజెక్టుల ద్వారా నిధులు సమకూరుతాయన్నారు. ఆసక్తి గలవారు సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు cse.iith.ac.in/admissions/phd లింకులో చూడాలని కోరారు.
-SHARE IT

Similar News

News August 20, 2025

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్టు విడుదల

image

TG: నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్టును మెడికల్&హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు MHSRB <>వెబ్‌సైట్‌లో<<>> తమ వివరాలను చెక్ చేసుకుని, ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సా.5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను సమర్పించాలని సూచించింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్‌లో పరీక్ష నిర్వహించగా 40,423 మంది అభ్యర్థులు హాజరయ్యారు. SHARE IT

News August 20, 2025

సుల్తానాబాద్: ‘రోగులకు మెరుగైన సేవలు అందించాలి’

image

సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, పీఏసీఎస్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా కొనుగోలు చేసిన రూ.12.50 లక్షల విలువైన అల్ట్రాసౌండ్, ఎన్‌ఎస్‌టీ యంత్రాలను ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

News August 20, 2025

జిల్లాలో యూరియాకు కొరత లేదు: కలెక్టర్ ఇలా

image

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని ఆమె వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.