News April 8, 2025
కందుకూరులో కనిగిరి యువకుడి ఆత్మహత్య

కందుకూరు పట్టణంలో కనిగిరి యువకుడు ఉరేసుకున్నాడు. కల్లూరి శివ నాగరాజు(26) కందుకూరు పోస్టాఫీస్ సెంటర్కు సమీపంలోని వెంకటరమణ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కనిగిరిలో క్రికెట్ బెట్టింగ్ వేసి అప్పులపాలై కందుకూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
Similar News
News April 17, 2025
పోలీస్ డాగ్ స్క్వాడ్ యూనిట్ను పరిశీలించిన ప్రకాశం ఎస్పీ

ఒంగోలులోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో బుధవారం డాగ్ స్క్వాడ్ యూనిట్ను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. అక్కడ ఉన్న వివిధ జాగిలాలను, వాటి గదులను, అందించే ఆహారాన్ని, వాటికి ఉపయోగించే వివిధ రకాల పరికరాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం దృష్ట్యా డాగ్ స్క్వాడ్లోని జాగిలాలకు వాతావరణం అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు.
News April 16, 2025
ఒంగోలు: కానిస్టేబుల్ భార్య సూసైడ్

పొదిలికి చెందిన పూర్ణిమ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నబజారు CI వివరాల మేరకు.. ఒంగోలుకి చెందిన AR కానిస్టేబుల్ నాగరాజు తన భార్య పూర్ణిమతో ములాపేట పోలీస్ క్వార్టర్స్లో ఉంటున్నారు. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది. ఈక్రమంలో పూర్ణిమ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆయన మొదటి భార్య కూడా ఉరేసుకుని చనిపోయారని తెలుస్తోంది.
News April 16, 2025
ప్రకాశం: సొంత పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న మాజీ మంత్రి?

మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ త్రిపురాంతకం ఎంపీపీ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికారని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. వైసీపీకి ఓటు వేసిన ఎంపీటీసీ సృజన సోదరి వసుంధర సురేశ్కు చెందిన జార్జ్ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్నారు. దీంతో ఆమెను విధుల నుంచి తప్పించారని టాక్. తాటిపత్రికి చెక్ వేయాలని చూడగా వైవీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.