News March 10, 2025
కందుకూరు ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు?

కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహారం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రామాయపట్నం పోర్టు నిర్మాణంలో జోక్యం చేసుకుంటున్న ఆయన వాటా కోసం డిమాండ్ చేసినట్లు ఆంధ్రజ్యోతి సంచలన <
Similar News
News January 8, 2026
నెల్లూరు జిల్లాలో లైసెన్సులు లేకుండానే..!

నెల్లూరు జిల్లాలో 165 kM మేర సముద్ర తీరం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఇస్కపాలెం, మైపాడు, కృష్ణపట్నం తదితర చోట్ల రొయ్యల చెరువులు ఉన్నాయి. ఎక్కువ భాగం ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తుండగా.. వాటికి మత్స్యశాఖ నుంచి లైసెన్సులు లేవు. అధికారికంగా 23వేల ఎకరాలే సాగు ఉండగా.. అనధికార చెరువులకు సైతం కరెంటు వాడుతున్నారు. మామూళ్ల మత్తులో మత్స్యశాఖ అధికారులు లైసెన్సులను చెక్ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
News January 8, 2026
నెల్లూరు: పథకాలు ఉన్నా.. అందడం లేదు!

మత్స్యశాఖలో ఎన్నో పథకాలు ఉన్నాయనేది చాలామందికి తెలియదు. రాష్ట్ర పథకాలు నిలిచిపోగా.. కేంద్ర పథకాలు ఉన్నా అమలు కావడం లేదు. నెల్లూరు జిల్లాలో 25 రకాల సబ్సిడీ పథకాల కింద 10,195 యూనిట్స్ కేటాయించారు. కేవలం 359 యూనిట్లు మంజూరు కాగా.. 9,835 యూనిట్లు మిగిలిపోయాయి. పథకాలపై ప్రచారం లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది. ఈ శాఖపై త్వరలో కలెక్టర్ రివ్యూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
News January 8, 2026
నెల్లూరు రూపు రేఖలు మారేనా..?

నెల్లూరులో త్వరలో 84KM మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. NH-16, బుచ్చి హైవే, మినీబైపాస్ రోడ్డు, పొదలకూరు రోడ్డు, ముత్తుకూరు రోడ్డు తదితర ప్రాంతాలు అనుసంధానం కానున్నాయి. ట్రాఫిక్ సమస్య తీరనుంది. కృష్ణపట్నం పోర్టుతో పాటు పలు పరిశ్రమలకు భారీ వాహనాల రాకపోకలు సులభంగా జరగనున్నాయి. దూరాభారాలు తగ్గనున్నాయి. లేబూరు బిట్-2 నుంచి రాజుపాలెం వరకు రింగ్ రోడ్డు రానుండగా భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది.


